పరమ
పరమ గీతము
గ్రంథకర్త
ఈ గ్రంథం శీర్షికను దీని మొదటి వచనంలో నుండి తీసుకున్నారు. “సొలొమోను రచించిన పరమగీతం” (1:1). ఈ గ్రంథంలో సొలొమోను పేరు పదేపదే కనిపించడంలో (1:5; 3:7, 9, 16, 8:11-12) దీనికి సొలొమోను రాసిన పరమగీతం అనే పేరు స్థిరపడింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 971 - 930
సోలోమోను రాజుగా ఉన్న కాలంలో ఈ పుస్తకం రాశాడు. సోలొమోనే దీని రచయిత. అని అంగీకరించే పండితులు అతని పరిపాలన ఆరంభదశలో రచించాడని చెబుతారు. ఈ కథనంలో యువకవి ఉత్సాహం కనిపిస్తుంది. అంతే గాక తన సామ్రాజ్యానికి ఉత్తరాన, దక్షిణాన ఉన్న ప్రదేశాలు లెబానోను, ఈజిప్టు ప్రాంతాల పేర్లు ఇందులో కనిపిస్తాయి.
స్వీకర్త
వివాహితులు, వివాహం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రయోజనం
ఇది ప్రేమ మాధుర్యాన్నిపొగుడుతూ రాసిన గ్రంథం. వివాహమంటే దేవుని ప్రణాళికేనని ఈ గ్రంథం స్పష్టం చేస్తున్నది. స్త్రీ పురుషులు వివాహబంధంలో మాత్రమే కలిసి జీవించాలి. ఒకరినొకరు అధ్యాత్మికంగా, భావోద్రేకపరంగా, శారీరికంగా ప్రేమించుకోవాలి.
ముఖ్యాంశం
ప్రేమ, పెండ్లి
విభాగాలు
1. వధువు సొలొమోను గురించి తలపోయడం — 1:1-3:5
2. వధువు ప్రదానానికి అంగీకరించడం, వివాహానికై ఎదురు చూడడం — 3:6-5:1
3. వరుణి కోల్పోయినట్టు వధువు కల — 5:2-6:3
4. వధూవరులు ఒకరినొకరు ప్రశంసించుకోవడం — 6:4-8:14