MRK intro

☀️

మార్కు

మార్కు రాసిన సువార్త

గ్రంథకర్త

ఈ పుస్తకాన్ని మార్కు రాశాడని ఆదిమ సంఘ పితరులంతా ఏక గ్రీవంగా అంగీకరించారు. కొత్త నిబంధనలో ఇతని పేరు పది సార్లు కనిపిస్తున్నది. (12:12, 25; 13:5, 13; 15:37, 39; కొలస్సి 4:10; 2 తిమోతి 4:11; ఫిలేమోను 24; 1 పేతురు 5:13). ఈ రిఫరెన్సులు మార్కు బర్నబా బంధువు అని సూచిస్తున్నాయి (కొలస్సి 4:10). మార్కు తల్లి పేరు మరియ. ఈమె యెరూషలేములో ధనం, పలుకుబడి ఉన్న స్త్రీ. ఈమె ఇల్లు ఆది క్రైస్తవులు సమావేశం అయ్యే చోటు (అపో. కా. 12:12). పౌలు మొదటి సువార్త ప్రయాణంలో పౌలు, బర్నబాలతో కలిసి మార్కు కూడా వెళ్ళాడు. (అపో. కా. 12:25; 13; 5). బైబిల్ సంబంధిత సాక్షాధారాలను బట్టి మార్కుకు పేతురుకు దగ్గర సంబంధం ఉంది (1 పేతురు 5:13). పేతురు ప్రసంగాలను ఇతర భాషల్లోకి మార్కు అనువదించి ఉండవచ్చు. మార్కు సువార్తకు ముఖ్య ఆధారాలు బహుశా పేతురు బోధలే, అతని ప్రత్యక్ష సాక్ష వివరణలే.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. శ. 67 - 70

సంఘ పితరులు (ఇరేనియస్, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంటు మొ.) మార్కు సువార్తను రోమ్ లో రాసి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు. ఈ సువార్తను పేతురు మరణం తరువాత మార్కు రాశాడని క్రీ. శ. 67, 68 నాటి ఆదిమ సంఘ సాంప్రదాయ గాథలు పేర్కొంటున్నాయి.

స్వీకర్త

ఈ పుస్తకంలో కనిపించే సమాచారాన్ని బట్టి మార్కు దీన్ని స్థూలంగా యూదేతర పాఠకుల కోసం ముఖ్యంగా రోమీయుల కోసం రాశాడని అర్థం అవుతున్నది. యేసు వంశావళి ఇందులో కనిపించదు. ఎందుకంటే యూదేతరులకి ఇలాటివి అర్థం పర్థం లేనివిగా కనిపిస్తాయి.

ప్రయోజనం

మార్కు సువార్త పాఠకులు ముఖ్యంగా రోమ్ క్రైస్తవులు. క్రీ. శ. 67, 68 లో వీరు నీరో చక్రవర్తి పాలనలో చిత్ర హింసలు ఎదుర్కొంటున్నారు. అనేక మంది హింసల పాలై మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహించడానికి మార్కు తన సువార్త రాశాడు. యేసును హింసల పాలైన సేవకునిగా అతడు చిత్రీకరించాడు (వ. 53).

ముఖ్యాంశం

యేసు, హింసల పాలైన సేవకుడు.

విభాగాలు

1. యేసు పరిచర్య కోసం సిద్ధబాటు — 1:1-13

2. గలిలయ పరిసరాల్లో యేసు పరిచర్య — 1:14-8:30

3. యేసు కార్యాచరణ: హింసలు, మరణం — 8:31-10:52

4. యెరూషలేములో యేసు పరిచర్య — 11:1-13:37

5. సిలువ కథనం — 14:1-15:47

6. పునరుత్థానం, యేసు ప్రత్యక్షం — 16:1-20

Navigate to Verse