విలాప
విలాప వాక్యములు
గ్రంథకర్త
ఈ గ్రంథంలో మాత్రం గ్రంథకర్త పేరు లేదు. అయితే క్రైస్తవ సంప్రదాయ గాథలను బట్టి యిర్మీయా దీని రచయిత అని తెలుస్తున్నది. గ్రంథకర్త యెరూషలేము విధ్వంసం ఫలితాలను కళ్ళారా చూశాడు. శత్రుదాడికి అతడు ప్రత్యక్షసాక్షి (1:13-15). ఈ రెండు సంభవాల సమయాల్లో యిర్మీయా అక్కడ ఉన్నాడు. యూదా జాతి దేవునిపై తిరుగుబాటు చేసి ఆయనతో తన నిబంధనను ఉల్లంఘించింది. దేవుడు బబులోనును సాధనంగా వాడుకుని తన ప్రజలను శిక్షించాడు. ఈ గ్రంథంలో వర్ణించిన తీవ్రమైన హింసలు అలా ఉండగా 3 వ అధ్యాయం లో ఒక నిరీక్షణ గురించిన వాగ్దానం కనిపిస్తున్నది. యిర్మీయా దేవుని మంచితనాన్ని గుర్తుచేసుకున్నాడు. దేవుని నమ్మకత్వం అనే సత్యం ద్వారా అతడు యూదా జాతికి ఓదార్పునిస్తున్నాడు. దేవుని కనికరాన్ని, ఎన్నటికీ విఫలం కాని ఆయన ప్రేమను వారికి తెలుపుతున్నాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 587 - 516
బబులోనీయులు యెరూషలేమును ముట్టడించి ధ్వంసం చేసిన సంభవాలను ప్రత్యక్ష సాక్షిగా అభివర్ణించాడు.
స్వీకర్త
చెర అనంతరం ఉన్న హెబ్రీయులు. ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చిన వారు, బైబిలు పఠతలంతా.
ప్రయోజనం
జాతి పాపం, వ్యక్తిగత పాపం రెంటికీ పరిణామాలు ఉంటాయి. తన ప్రజలను తిరిగి తన వద్దకు రప్పించుకోడానికి దేవుడు పరిస్థితులను, సాధనాలను ఉపయెగించుకుంటాడు, దేవునిలో మాత్రమే ప్రజలకు నిరీక్షణ ఉంది. చెరలో ఉన్న యూదులను దేవుడు శేషంగా మిగిల్చినట్టే ఆయన తన కుమారుడు యేసును రక్షకునిగా అనుగ్రహించాడు. పాపం శాస్వత మరణాన్ని తెస్తుంది. అయితే దేవుడు తన రక్షణ ప్రణాళిక ద్వారా నిత్యజీవాన్ని ఇస్తున్నాడు. విలపవాక్యములు గ్రంథం మన పాపం, తిరుగు బాటులకు ప్రతిగా దేవుని ఉగ్రత మనపై కుమ్మరించడం జరుగుతుందని స్పష్టం చేస్తున్నది. (1:8-9; 4:13; 5:16.)
ముఖ్యాంశం
విలాపం
విభాగాలు
1. యిర్మీయా యోరుషలేము కోసం విలపించడం — 1:1-22
2. పాపం దేవుని ఉగ్రతను కొనితెస్తుంది — 2:1-22
3. దేవుడు తన ప్రజలను ఎన్నటికీ విడిచిపెట్టడు — 3:1-66
4. యోరుషలేము మహిమ అంతరించి పోయింది — 4:1-22
5. యిర్మీయా తన ప్రజల కోసం చేసిన విజ్ఞాపన — 5:1-22