యిర్మీయా
యిర్మీయా
గ్రంథకర్త
యిర్మీయా తన లేఖికుడు బారూకుతో కలిసి ఈ పుస్తకం రాశాడు. ఇతడు యాజకుడు, ప్రవక్త కూడా. హీల్కియా అనే యాజకుని కొడుకు (2 రాజులు 22:8 లో కనిపించే ప్రధాన యాజకుడు కాదు). అనాతోమ అనే కుగ్రామానికి చెందినవాడు (1:1). బారూకు అనే లేఖికుడు ఇతని పరిచర్యలో సహాయం చేశాడు. తన ప్రవచనాలను యిర్మీయా చెబుతుండగా బారూకు రాశాడు. అతడు ఆ ప్రవచనాల ప్రతులను కూడా రాసి భద్రం చేసేవాడు (36:4, 32, 45:1). ఇతన్ని “విలాప ప్రవక్త” అన్నారు (9:1, 13:17, 14:17 చూడండి). దాడి చేయనున్న బబులోను వారి మూలంగా యూదా జాతి పైకి రానున్న తీర్పుల గురించి ప్రవచించడం ద్వారా కొంత వివాదాస్పద వ్యక్తిగా ఉండేవాడు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 740 - 680
బబులోను చెర కాలంలో గ్రంథ రచన పూర్తి అయింది. అయితే పుస్తకం ఎడిటింగు మరి కొంతకాలం వరకు కొనసాగిందని కొందరి అభిప్రాయం.
స్వీకర్త
యూదయ, యెరూషలేము ప్రజానీకం, తరువాత ఉండబోయే బైబిలు పాఠకులంతా.
ప్రయోజనం
క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తరువాత దేవుడు తన ప్రజలతో చేయబోయే కొత్త నిబంధన యొక్క స్పష్టమైన ఆకారాన్ని యిర్మీయా గ్రంథం ప్రదర్శిస్తున్నది. ఈ కొత్త నిబంధన దేవుని ప్రజలకు పూర్వక్షేమస్థితి కలిగే సాధనం. ఎందుకంటే ఆయన వారి హృదయాలల్లో తన ధర్మశాస్త్రం ఉంచుతాడు. రాతి పలకలపై గాక మాంసపు గుండెలపై దాన్ని రాస్తాడు. యిర్మీయా గ్రంథంలో యూదాను గురించిన అంతిమ ప్రవచనాలు హెచ్చరికలు ఉన్నాయి. జాతి మొత్తంగా దేవుని వైపు తిరగాలన్న పిలుపు ఈ పుస్తకంలో ఉంది. అదే సమయంలో యూదు జాతిలో ఎడతెగక కొనసాగుతున్న విగ్రహారాధన, దుర్నీ తిదృష్ట్యా వినాశనం తప్పదన్న సత్యాన్ని ఈ గ్రంథం గుర్తిస్తుంది.
ముఖ్యాంశం
తీర్పు
విభాగాలు
1. యిర్మీయాకు దేవుని పిలుపు — 1:1-19
2. యూదాకు హెచ్చరికలు — 2:1-35:19
3. యిర్మీయా బాధలు — 36:1-38:28
4. యెరూషలేము పతనం, దాని పరిణామాలు — 39:1-45:5
5. ఇతర జాతుల గురించి ప్రవచనాలు — 46:1-51:64
6. చారిత్రిక అనుబంధం — 52:1-34