ఎజ్రా
ఎజ్రా
గ్రంథకర్త
హీబ్రూ సంప్రదాయాన్ని అనుసరించి ఎజ్రాయే దీని రచయిత. ఇతని గురించి వివరాలు పెద్ధగా తెలియవు. ఇతడు ప్రధాన యాజకుడు అహరోను వంశీయుడు (7:1-5). ఆ విధంగా తనకై తానుగా యాజకుడు, శాస్త్రి. దేవుని పట్ల, దేవుని ధర్మశాస్త్రం పట్ల ఇతన్నికున్న ఆసక్తి ఒక యూదుల సమూహాన్ని పర్షియా రాజు అర్తహషస్త కాలంలో ఇశ్రాయేలుకు తీసుకుపోవడానికి ఇతన్ని ప్రోత్సహించింది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. పూ. 460 - 400
యూదా ప్రాంతంలో గ్రంథరచన జరిగింది. బహుశా బబులోను నుండి తిరిగి వచ్చిన తరువాత.
స్వీకర్త
చెరనుండి యోరుషలేముకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు, భవిష్యత్తులో బైబిలు పాఠకులందరూ.
ప్రయోజనం
ప్రజలను శారీరికంగా తమ జన్మభూమికి తీసుకు రావడానికి, పాపం నుండి మళ్ళుకొని పశ్చాత్తాప పడడం ద్వారా ఆత్మ సంబంధంగా తన దగ్గరకు సమకూర్చుకోవడానికి దేవుడు ఎజ్రాను ఒక సంకేతంగా ఉపయోగించుకున్నాడు. మనం దేవుని పని చేసేటప్పుడు అవిశ్వాసుల నుండి, దైవ వ్యతిరేక ఆత్మశక్తుల నుండి వ్యతిరేకత తప్పక వస్తుంది. అయితే మనం ముందుగా సిద్ధపడి ఉంటే అలాంటి వ్యతిరేకతను మరింత బాగా ఎదుర్కొగలం. విశ్వాస మూలంగా మన ప్రగతికి అడ్డు పడే అవరోధాలను అధిగమించగలం. మన బ్రతుకుల్లో దేవుని ప్రణాళిక నెరవేరకుండా కలిగే గొప్ప ఆటంకాలు నిరుత్సాహం, భయం.
ముఖ్యాంశం
పూర్వ క్షేమస్థితి
విభాగాలు
1. జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటి పునరాగమనం — 1:1-6:22
2. ఎజ్రా నాయకత్వంలో రెండవ పునరాగమనం — 7:1-10:44